15 April, 2026 | 1:15 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కిట్స్ కళాశాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు

18-12-2025 07:08 PM

కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సువార్త చర్చి పాస్టర్ రవి కుమార్ పాల్గొని  విద్యార్థినులకు దైవ సందేశం ఇచ్చారు. ప్రేమకు ప్రతి రూపం యేసు ప్రభువని, అందరు యేసు ప్రభువు సందేశాన్ని పాటించాలని, శాంతి మార్గాన్ని ఆచరించాలన్నారు, ఇతరులపై ప్రేమ, జాలి, కరుణ, చూపించాలని, సోదర భావంతో కలిసి మెలిసి జీవించాలన్నారు, అనంతరం విద్యార్థినులతో కలసి కేక్ కట్ చేసి ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు ఆలపించిన భక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, అధ్యాపకులు, నరసింహ రావు, నాగరాజు, లక్ష్మణ్, అరుణ, ఝాన్సీ, సంధ్య, కళ్యాణి, కిరణ్ కుమార్, వెంకట రత్నం, ప్రత్యుష, విద్యార్థినులు పాల్గొన్నారు.