10 April, 2026 | 3:20 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

ఆ తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపండి

29-06-2024 12:02 AM

రెవెన్యూ మంత్రికి ‘ట్రెసా’ నాయకుల విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి): ఎన్నికల వేళ బదిలీ అయిన తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రతినిధి బృందం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరింది. ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు శుక్రవారం నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి నివాసంలో ఆయన్ను కలిశారు. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నెలలో పదవీ విరమణ పొందే ఏడుగురు తహసీల్దార్లను వారి సొంత జిల్లాలకు పంపాలని కోరారు. బాలానగర్ ఆర్‌ఐ వెంకట్‌రెడ్డి సస్పెన్షన్‌ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. తమ వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారని సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి మాట్లాడారని ట్రెసా నాయకులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ట్రెసా ప్రధానకార్యదర్శి కె.గౌతమ్‌కుమార్, ఉపాధ్యక్షులు బాణాల రాంరెడ్డి, కె.నిరంజన్‌రావు, మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు చెన్న కిష్టన్న, కార్యదర్శి రాజ్‌గోపాల్, జగిత్యాల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ వకీల్ తదితరులు పాల్గొన్నారు.