7 April, 2026 | 11:17 AM

Breaking News

బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •   పరిగి పర్యటనకు బ్రేక్ — మాజీ మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి హౌస్‌ అరెస్ట్‌   •   రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం... తగలబడిన బట్టల షాపు   •   కూల్ బీరు అడిగిండని కాళీ సీసతో వ్యక్తిపై దాడి.!   •   జలాశయాలు డెడ్ స్టోరేజ్ : తాగునీటికీ కటకట!   •  

హత్య కేసులో పలువురి అరెస్టు

11-10-2025 12:19 AM

బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలోని సోమూరు గ్రామంలో సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో గొడవ జరిగింది. భీమ్ రావు కు రాజ్ కుమార్ డబ్బులు బాకీ ఉండగా.. రాజ్ కుమార్ ఇష్టం వచ్చినట్టు తిట్టడంతో వారందరూ కలిసి రాజ్ కుమార్ ను కట్టెలతో కొట్టారు. దీంతో రాజ్ కుమార్ తరపు బంధువులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో గ్రామానికి పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే తీవ్రగాయాల పాలైన రాజ్ కుమార్ ఈ నెల 6న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో రాజ్ కుమార్ పై దాడి చేసిన సూర్యకాంత్, రామన్నాథ్, రాచప్ప, తేజరావు, పండిత్ రావు, హనుమంత్, బీంరావ్ లను హత్యా నేరం కేసుపై అరెస్టు చేశారు. అనంతరం శుక్రవారం వారందరినీ కోర్టులో హాజరు పరిచి రీమాండ్ కి తరలించామని బాన్సువాడ డి.ఎస్.పి విఠల్ రెడ్డి మద్నూర్ పోలీస్ స్టేషన్ లో  తెలియజేశారు.