21-06-2025 10:08:50 PM
వాజేడు (విజయక్రాంతి): నిత్యం యోగ సాధనతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు(Mandal Education Officer Venkateswara Rao) అన్నారు. వాజేడు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వాజేడు నాగారంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంగ్ల ఉపాధ్యాయుడు చల్లగురుగుల మల్లయ్య అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించి, విద్యార్థుల చేత ఉపాధ్యాయుల చేత యోగా ఆసనాలు వేయించారు. తడాసన్, అర్థ కటి చక్రాసన్, ధ్యానం, ప్రాణయామం, మొదలగు ఆసనాలను విద్యార్థులకు నేర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు సోయం ఆనందరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యోగా మానవ శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతిరోజు యోగ సాధన చేయడం వల్ల అనారోగ్యాలను ఎదుర్కోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కోరిక స్వరూప్ సింగ్, రంగు ఆనందు, తెల్లం రాజ్యలక్ష్మి, కోకిల శ్రీరంగం తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.