15 June, 2026 | 1:58 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

బద్దిపడగ పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు

13-11-2025 08:13 PM

నంగునూరు: మండల పరిధిలోని బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజగోపాల్పేట్ ఎస్ఐ వివేక్ సూచించారు. గుడ్ టచ్,బ్యాడ్ టచ్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మైనర్ డ్రైవింగ్, బాల్య వివాహాల దుష్పరిణామాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాలపై షీ టీమ్ బృందం అవగాహన కల్పించారు.

షీ టీమ్ విధి విధానాలు,సైబర్ నేరాల వల్ల ఎదురయ్యే నష్టాలు, పోక్సో చట్టాల ప్రాముఖ్యత వివరించారు.ఎవరైనా వేధించినా, వెంబడించినా, అవహేళనగా మాట్లాడినా వెంటనే డయల్ 100, లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 8712667434, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498 లేదా మహిళా పోలీస్ స్టేషన్ 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో హెడ్మాస్టర్ పద్మ,ఉపాధ్యాయ బృందం,షీటీమ్ సిబ్బంది ఏఎస్ఐ కిషన్,కానిస్టేబుల్స్ ప్రవీణ్,రజిని, మమత తదితరులు పాల్గొన్నారు.