15 June, 2026 | 10:19 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

13-11-2025 08:40 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రెటరీ జి.తిరుపతి గురువారం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల యొక్క శారీరక సామర్ధ్యాలను, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 13 బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో అండర్ 19 విభాగంలో లక్షెట్టిపేట్ బాలుర కళాశాల విజయం సాధించగా, అండర్ 14 విభాగంలో జాంగాన్ బాలుర పాఠశాల విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి  సేరు శ్రీధర్,పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ,బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, ఏటీపీ తిరుమల్, డిప్యూటీ వార్డెన్ వాణి, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.