31 May, 2026 | 10:32 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

శబరిమలలో షూటింగ్ వివాదం

25-01-2026 12:06 AM

దర్శకుడి విచారణకు టీడీబీ ఆదేశం

త్రివేండ్రం, జనవరి ౨౪: శబరిమలలోని అయ్యప్ప ఆలయ సన్నిధానంలో ఈనెల ౧౪వ తేదీ సాయంత్రం మకర జ్యోతి వెలుగుతున్న వేళ మలయాళ దర్శకుడు అనురాజ్ మనోహర్ ఓ సినిమా చిత్రీకరణకు పూనుకున్నాడనే వచ్చిన ఆరోపణలపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ (టీడీబీ) స్పందించింది. అనురాజ్ వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు టీడీబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేపడుతున్నది.

విచారణలో చిత్ర యూనిట్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీడీబీ ప్రకటించింది. ఈ అంశంపై దర్శకుడు అనురాజ్ స్పందిస్తూ.. తాను ఎలాంటి సినిమా చిత్రీకరణ చేయలేదని చెప్తున్నారు. తన తదుపరి చిత్రంలో శబరి మల సెట్ వేయనున్నామని, కేవలం రిఫరెన్స్ కోసమే తాను ఐఫోన్‌లో కొన్ని ఫొటోలు తీశానని తెలిపారు. తన సెట్ సహజసిద్ధంగా ఉండాలనే కోరికతోనే ఆ ఫొటోలు తీశానని చెప్తున్నారు.