9 May, 2026 | 1:10 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం

29-07-2025 02:04 AM
  1. దుండగుడి చేతిలో ఐదుగురు హతం
  2. అనంతరం తననుతాను కాల్చుకున్న నిందితుడు

న్యూఢిల్లీ, జూలై 28: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. అనంతరం దుండగుడు తన ను తాను కాల్చుకున్నాడు. పోలీసులు ఘట నా స్థలానికి చేరుకొని ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అక్కడి మీడియా తెలిపిన ప్రకా రం థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఓర్ టు కో మార్కెట్‌లోకి చొరబడి నలుగు రు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళను మట్టుబెట్టాడు.

అనంతరం తననుతాను కాల్చు కున్నాడు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ సమీపంలో ఈ ఘటన జర గింది. స్థానికులతో పాటు పర్యాటకులు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ కాల్పులకు థాయ్‌లాండ్ కంబోడియా సరిహద్దు వద్ద జరుగుతున్న ఘర్షణలతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మే నెలలో సైతం థాంగ్ జిల్లాలోని ఓ పాఠశాల సమీపంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పో యారు.