24-05-2025 12:23:58 AM
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
జగిత్యాల, మే 23 (విజయక్రాంతి): అకా ల వర్షాల మూలంగా తడిసిన ధాన్యం సై తం కొనుగోలు చేయాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గ పరిధిలోగల బుగ్గారం మండలం మద్దనూరు, ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేం ద్రాలను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తడిసిన ధాన్యం ఆరబోసి, మాయీశ్చర్ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు. కొను గోలు చేసిన ధాన్యం సంచులు నానినట్లయి తే వెంటనే బాయిల్ రైస్ మిల్లర్లక పంపించాలని ఆదేశించారు. ప్రతిరోజు మిల్లులకు పంపాలి, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి న ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు.
కొనుగోలు సెంటర్లలో ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హమాలీల సమస్య రా కుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొను గోలు కేంద్రాల వద్ద అధికారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ పేర్కొన్నారు. సెంటర్ ఇంచార్జ్ అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట డిసిఓ మనోజ్ కుమార్, డిఎస్ఓ జితేందర్ రెడ్డి, డిఎం జితేంద్ర ప్రసాద్, బుగ్గారం తహసిల్దార్, ధర్మపురి ఇన్చార్జ్ తహసిల్దార్ సుమన్, సంబంధిత అధికారులున్నారు.