1 July, 2026 | 6:55 PM

Breaking News

అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •  

సికిల్ సెల్ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి

16-05-2025 12:28 AM

జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ 

కల్వకుర్తి మే 15: 2047 సంవత్సరం నాటికి భారతదేశంలో సికిల్ సిల్ బాధితులు లేకుండా చేయడమే లక్ష్యంగా భారత ప్రభు త్వం కృషి చేస్తుందని జిల్లా సికిల్ సెల్ నొడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ అన్నారు. గురువారం వెల్దండ   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  జిల్లా సికిల్ సెల్ నోడల్ అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో  ఎంఎల్ హెచ్ పి లకు,  ఏఎన్‌ఎం లకు, ఆశా కార్యకర్తలకు పర్యవేక్షణ సిబ్బందికి సికిల్ సిల్ అనీమియాపై అవగాహన, 

స్క్రీనింగ్ పరీక్షలపై శిక్షణ ఇచ్చారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికిల్ సెల్ అనిమియా జన్యుపరమైన లోపం వలన  తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుందన్నారు.  సా ధారణంగా ఎర్ర రక్త కణాల జీవితకాలం 120 రోజులు ఉంటుంది, కానీ సికిల్ సెల్ వ్యాధితో బాధపడే వారికి ఎర్ర రక్త కణాల జీవితకాలం 10-20  రోజులు మాత్రమే ఉం టుందని ఇలాంటి వారు తరచుగా రక్తహీనత తో బాధపడుతుంటారని తెలిపారు.

వారితో పాటు వెల్దండ వైద్యాధికారి డాక్టర్ సింధు, ఏపిఓ నిరంజన్,  మలేరియా అధికారి పర్వతాలుఎంఎల్ హెచ్పిలు, నవీన్, యాదయ్య , సాయి పవన్, సూపర్వైజర్లు మురళి, కవిత ఆరోగ్య కార్యకర్తలు లక్ష్మణ్, గోవర్ధన్, ఎఎన్‌ఎం తిరుపతమ్మ, పద్మ, ఎల్ల మ్మ, జానకి, చంద్రకళ, పద్మావతి, జహంగీర్ బి, ఆశా కార్యకర్తలు సుజాత, స్వప్న, యా దమ్మ, వసంత, చంద్రకళ, మండల వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.