01-06-2025 12:43:44 AM
ఇప్పుడంతా ఎక్కడ చూసినా కేసీఆర్ తనయ కవిత టాపిక్కే. ఏ ఇద్దరు కలిసినా సొంత పార్టీ నేతలపై కవిత చేస్తున్న విమర్శలపైనే మాట్లాడుకుంటున్నారు. ఆమె చేస్తున్న కామెంట్లపై పెద్ద సారుతో సహ గులాబీ పెద్ద లీడర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. వాళ్లంతా సైలెంట్గా ఉన్నా..కవిత తన ఆరోపణలు కంటిన్యూ చేస్తూనే.. తన పొలిటికల్ కెరీర్కు చకచకా పావులు కదుపుతున్నా రు.
ఓ వైపు తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్నారు..మరోవైపు కేసీఆర్ మీద ఈగ వాలనిచ్చేది లేదంటూ ప్రత్యర్థి పార్టీలకు వార్నింగులు ఇస్తున్నారు. కేసీఆర్పై కాళేశ్వరం విచారణ నోటీసులకు నిరసనగా ఈనెల 4న ఇందిరా పార్క్ ధర్నాను కూడా అనౌన్స్ చేశారు.
నోటీసులపై బీఆర్ఎస్ ఏ కార్యక్రమం ప్రకటించకముందే కవిత దూకుడు పెంచారు. కవిత స్పీడ్ను చూస్తున్న జనాలకు కారు పార్టీలోంచి కొత్త పార్టీ పుట్టుకొస్తుందనే అనుమానాలు బలపడుతున్నాయి. కొత్త పార్టీ వస్తుందా..? టీకప్పులో తుఫాన్ మాదిరిగా అంతర్థానం అవుతుందా.. అనేది చూడాలి మరి! తమ్మనబోయిన వాసు