13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సింధు @ 500 విజయాలు

23-01-2026 12:21 AM

చరిత్ర సృష్టించిన భారత షట్లర్

జకార్తా, జనవరి 22 : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చరిత్ర సృష్టించింది. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కెరీర్‌లో 500వ విజయాన్ని అందుకుని రికార్డులకెక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్‌గా ఘనత సాధించింది. ఓవరాల్‌గా వరల్డ్ బ్యాడ్మింటన్‌లో ఈ మైలురాయి అందుకున్న ఆరో ప్లేయర్‌గా నిలిచింది. ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీ ప్రీక్వార్టర్ ఫైనల్లో సాధించిన విజయంతో ఆమె ఈ రికార్డు అందుకుంది. డెన్మార్క్ ప్లేయర్ హోజ్‌మార్క్‌పై 21-19, 21-18 స్కోరుతో గెలిచిన సింధు క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో సింధు చైనా ప్లేయర్ చెన్ యూతో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా క్వార్టర్స్ చేరాడు.