03-06-2025 06:16:51 PM
అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): భూభారతితో రైతుల సమస్యల పరిష్కారం అవుతాయని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి(Additional Collector Veera Reddy) అన్నారు. మంగళవారం మండలంలోని వర్కట్ పల్లి, ఎం. తుర్కపల్లి గ్రామాలలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కాగా వర్కట్ పల్లి గ్రామ రెవెన్యూ సదస్సు లో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి పాల్గొని మాట్లాడుతూ... గ్రామాల్లో పేరుకుపోయిన రైతుల సమస్యలకు నూతనంగా తీసుకువచ్చిన భూభారతిలో పరిష్కారం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులో పలువురు రైతులు అందించిన పలు దరఖాస్తులను రెవిన్యూ సిబ్బంది స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ పల్లవి, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మనోహర్, రెవిన్యూ సిబ్బంది, మహిపాల్ పాల్గొన్నారు.