03-06-2025 06:21:30 PM
ఎస్సై సురేష్..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): ఆన్లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సురేష్(SI Suresh) మంగళవారం మున్సిపల్, మండల ప్రజలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... తెలినటువంటి నంబర్ల నుండి ఇంటి టాక్స్, బండి ఇన్సూరెన్స్, షాప్స్ సంబంధించిన ట్రేడింగ్ లైసెన్స్,సీసీ కెమెరాలకి సంబంధించిన లైసెన్స్ గురించి మున్సిపల్ ఆఫీస్ నుంచి లేదా జిపి ఆఫీసు నుండి ఫోన్ చేస్తున్నాం అని చెప్పి వాటికి పర్మిషన్ తీసుకోలేదని ఎవరు కాల్ చేసినా నమ్మవద్దని మున్సిపాలిటీకి సంబంధించిన ట్యాక్సీ కట్టలేదని ఎవరు తెలియని వ్యక్తులు పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయవద్దని, షాప్ కు సంబంధించిన లైసెన్స్ రెనివల్ అయిపోయిందని చెప్పిన నమ్మవద్దని నేరుగా సంబందిత ఆఫీసు కి వెళ్ళి తెలిసుకొని డబ్బులు కట్టాలని తెలిపారు. ఏలాంటి డబ్బులు గానీ, స్కానర్ ద్వారా గాని పంపించవద్దని వాటి పేరు తో ఆన్ లైన్ మోసాలు జరుగుతున్నాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎస్సై తెలిపారు.