1 August, 2026 | 6:57 PM

Breaking News

కేరళ గ్లోబల్ హై స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ   •   ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థిని, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ పోస్టర్ ఆవిష్కరణ   •   ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ   •   చిట్టాపూర్‌లో మహిళా గ్రామసభ   •   నిజాయతీ చాటుకున్న వ్యాపారికి సామాజిక కార్యకర్త ఘన సన్మానం   •   పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొట్ట మొదటి టీకా   •   గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే లక్ష్యం   •   ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధనకు నా వంతు కృషి చేస్తా: ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య   •   వికలాంగులకు అన్నదానం చేసిన తాటిపల్లి భూపతి   •  

ఆర్టీసీ బస్సులో స్పెషల్ చార్జీలు ఆపాలి

07-10-2025 12:09 AM

నాగర్ కర్నూల్ అక్టోబర్ 6 ( విజయక్రాంతి )ప్రజా రవాణా సంస్థ రెగ్యులర్ బ స్సులలో పండగల పేరుతో ప్రయాణికుల నుండి స్పెషల్ చార్జీలను వసూలు చేయడా న్ని తక్షణం ఆపాలని బహుజన్ సమాజ్ పా ర్టీ నేతలు సోమవారం డిపో మేనేజర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర మాజీ ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలపై అనవసరమైన అదనపు భారం మోపుతోందన్నారు.పండగలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత కూడా స్పెషల్ చార్జీలు వసూలు చే యడం అన్యాయం అన్నారు. ఫీజు రీ-ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బిల్లులు, స్కూల్ బిల్లులు ఇలా ప్రతిదీ పెండింగ్లో పెడుతూ పెండింగ్ ప్రభుత్వాంగామారిందాన్నారు.