16 April, 2026 | 6:08 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

రౌడీ షీటర్లకు ప్రత్యేక మేళా!

10-05-2025 03:52 PM

 28 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేత 

మహబూబాబాద్, (విజయక్రాంతి): రౌడీషీటర్లకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు(Mahabubabad District Police) ప్రత్యేకంగా మేళా నిర్వహించి, సత్ప్రవర్తన కలిగిన 28 మంది పై ఉన్న రౌడీ షీట్లను ఎత్తివేశారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో రౌడీషీట్ ఎత్తివేత కోసం రౌడీ షీటర్లతో ప్రత్యేకంగా మేళా నిర్వహించి నేర చరిత్రపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జీవితాన్ని గడుపుతున్న 28 మందిని గుర్తించి వారిపై ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేసినట్లు డి.ఎస్.పి తిరుపతిరావు తెలిపారు. రౌడీషీట్లు తొలగించిన వారు భవిష్యత్తులో ప్రశాంతమైన జీవనాన్ని గడిపేందుకు కృషి చేయాలన్నారు. నేర ప్రవృత్తి కలిగిన వారిలో మాకు తీసుకువచ్చే విధంగా సత్ప్రవర్తన తో మెలుగుతున్న వారిపై ఉన్న రౌడీషీట్లను ఎత్తివేయడం జరిగిందన్నారు. రౌడీ షీట్లు ఉన్నవారు తమ ప్రవర్తనను ఇప్పటికైనా మార్చుకొని సత్ప్రవర్తనతో మెదలాలని సూచించారు. ఈ కార్యక్రమములో సిఐలు దేవేందర్, రాజేష్, రవి, ఎస్సైలు తిరుపతి, దీపిక పాల్గొన్నారు.