22 May, 2026 | 9:53 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

25-07-2025 06:57 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్ లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ మహిళ కళాశాల(టీ జీ ఎస్ డబ్ల్యూ ఆర్ డీ సీ) లో దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయినట్లు కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్. జి. అనూష తెలిపారు. బీఎస్సీ (ఎంపీసీఎస్), (ఎంఎస్డీఎస్), (బీజేడ్సీ), (ఎంజేడ్సీ), బీకాం (బీఏ), బీకాం(కంప్యూటర్స్ అప్లికేషన్), బి.ఏ(హెచ్ఈపీ) కోర్సుల్లో ఉన్న ఖాళీలను ఈ నెల 31 వరకు స్పాట్ అడ్మిషన్ల రూపంలో భర్తీ చేస్తున్నామన్నారు. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు పదవ తరగతి మెమో, ఇంటర్మీడియట్ మెమో, 2025 జనవరి తర్వాత పొందిన ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ జిరాక్స్, ఇంటర్మీడియట్ టిసి ధ్రువీకరణ పత్రాలతో నేరుగా కళాశాలకు వచ్చి అడ్మిషన్ పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.