17-08-2025 04:41:42 PM
సదాశివనగర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) సదాశివనగర్ మండలంలోని ఉత్తునూరు గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఆదివారం గ్రామంలోని హనుమన్ మందిరము నుండి ప్రధాన వీధులగుండా ఉరేగిప్పుగా వెళ్లి అంగడి బజారులో యాదవ యూత్ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టారు. కండెరాయ ఆలయములో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన ఉట్టిని గ్రామ యువకులు పగలకొట్టారు. ఉట్టి కొట్టిన వారికి నగదు బహుమతిని యాదవ యూత్ 2000 రూపాయలు, వీడీసీ కమిటీ 5000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమములో వీడీసీ అధ్యక్షుడు శ్రీకాంత్ రావు, ఉపాధ్యక్షుడు చిన్న వీరన్న, కోశాధికారి రమేష్, యాదవ సంఘ సభ్యులు గోగునూరి బాలయ్య, కరికాడ రాజు,కొత్తగొల్ల శ్రీను,మోతె రాజు, కొత్తగొల్ల శివ, లక్ష్మిపతి, పరమేష్,పబ్బ రమేష్,కార్తీక్, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.