13-12-2024 02:02:58 AM
కరీంనగర్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): టీయూడౠ్ల్య జే (ఐజేయూ) కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిగా గాండ్ల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కరీంనగర్లో గురువారం 16 మంది కార్య వర్గ సభ్యుల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. అలాగే ప్రధాన కార్యదర్శిగా కొయ్యడ చంద్రశేఖర్, కోశాధికారిగా గాజుల వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా ఎండీ షుకూర్, శైలేందర్రెడ్డి, గాండ్ల సంపత్, సంయుక్త కార్యదర్శులుగా పీ సంపత్, డీ సంపత్, కే తిరుపతి ఎన్నికయ్యారు. నూతన కమిటీ కార్యవర్గ సభ్యులకు కేంద్ర మం త్రి బండి సంజయ్కుమార్ అభినందనలు తెలిపారు.