20-08-2025 09:01:51 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): రాష్ట్ర తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యలో నిర్మల్ జిల్లా ఖానాపూర్ వాస్తవ్యులుకు చోటు దక్కింది. ఖానాపూర్ వాస్తవ్యుడైన పిసుపాటి వెంకటప్పయ్యకు రాష్ట్ర కార్యవర్గంలో సహాయ కార్యదర్శిగా చోటు కల్పించారు. ఈ మేరకు మంగళవారం వరంగల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో అతనికి నియామక పత్రం అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని వెంకటప్పయ్య అన్నారు.