13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

అగ్రహారం జేఎన్టీయూ కళాశాల అభివృద్ధికి చర్యలు

13-01-2026 12:25 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ,జనవరి 12,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం జేఎన్టీయూ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్ సోమవారం సందర్శించారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హెచ్ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కే. వెంకటేశ్వర రావు, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ కళాశాల తరగతి గదులు, ల్యాబ్, క్యాంటీన్, వంటగది పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు.

కళాశాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, బాలికల హాస్టల్కు రూ.10 కోట్లతో నిర్మాణం కొనసాగుతోందని, త్వరలో శాశ్వత భవనం మం జూరు చేస్తామని తెలిపారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఉచిత కోచింగ్, ఉద్యోగ అవకాశాలకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పా రు. తెలంగాణ రాష్ట్రంలో స్కిల్, స్పోరట్స్ యూ నివర్సిటీలు, వేములవాడకు రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ మంజూరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని మంచి భవిష్యత్ సాధించాలని ఆకాంక్షించారు.