13-08-2025 01:16:33 AM
హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): నీటి పారుదల శాఖ సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్టతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికా రులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డ ఉదంతంలో జాతీ య భద్రత సంస్థతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ చేసిన వ్యాఖ్యలతో సీడీవో ప్రతిష్ట దెబ్బతిన్నదన్నా రు. దీనిపై సీడీవో పునఃసమీక్షించుకుని సంస్కరణలు చేపట్టడం అత్యవసరమని సూచించారు.
అందుకు రాష్ర్ట ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. మంగళవా రం సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో ఆయన విస్తృతస్థాయి సమావేశం నిర్వ హించారు. నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అంజద్ హుస్సేన్, రమేశ్బాబు, జాయింట్ సెక్రటరీ కే. శ్రీనివాస్, సీడీవో సీఈ సత్యనారాయణరెడ్డి, సీఈలు అజయ్కుమార్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా సీడీవోను బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా ప్రాజెక్టుల డిజైన్ల రూపకల్పనలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకరావాలన్నారు. గతంలో సీడీవో తెలుగు రాష్ట్రాలతో పాటు యావ త్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిందని, వందేళ్ల క్రితం నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి మొదలు పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్మించిన ప్రధాన ప్రాజెక్ట్ నిర్మాణాలలో వినియోగించిన సాంకేతికత తెలంగాణ సీడీవో ప్రతిభకు పట్టం కడుతుందన్నారు.
సీడీవోలో ఉద్యోగాల భర్తీ
డిజైన్ విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కి తక్షణం చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అన్నీ స్థాయిలలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం సం స్థను బలోపేతం చేయడంలో భాగమేనన్నారు. ఐఐటీ, ఎన్ఐటీల వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి నీటి పారుదల శాఖలో నియమితు లైన ఇంజినీర్లకు సీడీవోలో పోస్టింగ్ ఇవ్వబోతున్న ట్టు వెల్లడించారు.
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకు న్నవి కావడంతో ప్రతిభావంతులైన ఇంజినీర్ల సేవ లు వినియోగించుకోవాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్ధిష్టమైన ఇంజినీరింగ్, సృజ నాత్మక అవసరమని, అది అత్యుత్తమ శిక్షణ పొం దిన నిపుణుల ద్వారానే సాధ్యపడుతుందన్నారు. పదవీ విరమణ పొందిన, అనుభవజ్ఞులైన వారి సేవలు కుడా వినియోగించుకుని అద్భుతమైన ఫలితాలు రాబట్టాలని సూచించారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ఎలక్ట్రోమెకానికల్ ఇంజినీరింగ్ ప్రాముఖ్యత మునుముం దు మరింత పెరగబోతుందని, లోతైన పరిజ్ఞానం కలిగి ఉన్న నిపుణులను నియమించడం ద్వారా సీడీవో తిరిగి పూర్వవైభవం చాటుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.