calender_icon.png 7 August, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు..

07-08-2025 04:47:57 PM

శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్..

అడిషనల్ డీసీపీ వెంకటరమణ..

హుజురాబాద్ (విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని అడిషనల్ డీసీపీ వెంకటరమణ(Additional DCP Venkataramana) సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్  పట్టణంలోని మామిండ్లవాడ, గ్యాస్ గోదాం ఏరియాలో హుజురాబాద్ ఏసీపీ మాధవి(ACP Madhavi) ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధృవ పత్రాలు లేని 75 వాహనాలను పోలీసులు  సీజ్ చేశారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేపించారు.

ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రజలు మత్తు పదార్థాలపై సమాచారం పోలీసులకు అందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయని, సైబర్ నేరాల నుంచి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్దన్ సెర్చ్ ద్వారా శాంతి భద్రత పరిరక్షణకు తోడ్పడుతుందని పోలీసులకు ప్రజలకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి అన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో  6 గురు సి ఐ లు, 4 గురు ఎస్సైలతో సహా  100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.