13 May, 2026 | 10:31 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

గురుకుల పాఠశాలలో విద్యార్థి అనుమానాస్పద మృతి

07-10-2025 03:20 PM

హైదరాబాద్: ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెదని ఘటన సిద్దిపేట జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో వివేక్ విద్యార్థి ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. దసరా పండుగ సెలవులు ముగియడంతో తండ్రి ఇవాళ ఉదయం 9 గంటలకు వివేక్ ను స్వగ్రామమైన నాగునూరు నుంచి తీసుకోచ్చి పాఠశాలలో వదిలేసి వెళ్లాడు. ఇంతలోనే తన కుమారుడు చనిపోయాడని తండ్రికి ఫోన్ వెళ్లింది.

వివేక్ కు ఏం జరిగిందని ఉపాధ్యాయులను అడిగితే విద్యార్థి పాఠశాలలోని కారిడార్‌లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మెడకు తాడు చుట్టుకుని చనిపోయాడని ఉపాధ్యాయులు చెప్తున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి, శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పాఠశాలకు చేరుకుని దర్యాప్తు  పోలీసులు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.