15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బుగ్గపాడులో మౌలిక వసతులు పూర్తి చేయండి

17-12-2025 01:49 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బుగ్గ పాడు పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన మంగళవారం టిజిఐఐసి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వ హించారు. సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజ య్ కుమార్ కూడా పాల్గొన్నారు.

బుగ్గపాడులోని 200 ఎకరాల్లో మెగా ఫుడ్ పార్కు, తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్, ఎంఎస్‌ఎంఇ జోన్‌లను టిజిఐఐసి ఏర్పాటు చేసిం ది. ఇక్కడ పరిశ్రమ లు ఏర్పాటు చేయడానికి పెట్టుబడిదారులు ముందుకొస్తున్నం దున త్వరితగ తిన ఏర్పాట్లన్నీ పూర్తిచేయాలని శ్రీధర్‌బాబు సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులో జనవరిలో పరిశ్రమల నిర్మాణా లు మొదలయ్యేలా చూడాలని ఆయన ఆదేశించారు. మెగా ఫుడ్ పార్కుకు కేటాయిం చిన 60 ఎకరాల్లో యూనిట్ల నిర్మాణాలను ప్రారంభించేలా భూకేటాయింపులు పొంది న వారిని కోరాలని తెలిపారు. 

తెలంగాణా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌ను 80 ఎకరాలు, ఎంఎస్ ఎంఇ జోన్‌ను 60 ఎకరాల్లో ఏర్పా టు చేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జో న్‌లో కొత్తగా వ్యవసాయ, అక్వారంగ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. సమావేశంలో టిజిఐఐసి ఎండి శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, డైరెక్టర్ (ఇన్ వెస్ట్ మెంట్స్) మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.