17 April, 2026 | 3:14 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

22-10-2025 07:27 PM

తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ఈనెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జాజిరెడ్డిగూడెం మండల తహాశీల్దార్ బాషపాక శ్రీకాంత్ కోరారు. బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని తహాశీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ గోపితో కలిసి నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, పీజీ, ఫార్మసీ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు కలిగిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చునని తెలిపారు.

సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సాకారంతో 250 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. మండల కేంద్రం అర్వపల్లి నుండి నిరుద్యోగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగుతుందని, నిరుద్యోగ యువత సకాలంలో హాజరై ఉపాధి అవకాశాలు పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, నిరుద్యోగలు తదితరులు పాల్గొన్నారు.