calender_icon.png 17 June, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

16-06-2025 01:42:31 AM

తుర్కయంజాల్, జూన్ 1౫: ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతుండటంతో ఎంతో గర్వకారణమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి మునగనూరుకు చెందిన లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రంగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంగా మారిందన్నారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోనే ఎంతో మంది పేదలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరిందని తెలిపారు.

అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు గతంలో కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రస్తుతం ఏ ఆస్పత్రిలోనైనా వైద్యం చేయించుకునే సదావకాశం లభించిందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువచేయడంలో టీఆర్‌ఎస్ నాయకులు, కార్యర్తల కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో మునగనూర్ గ్రామానికి చెందిన లబ్ధిదారు దోమలపల్లి వెంకటేష్, గడ్డన్నారం మార్కెటింగ్ డైరెక్టర్ దోమలపల్లి అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల అమరేందర్ రెడ్డి, దోమలపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ ఒకటో వార్డ్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.