14-11-2025 12:20:21 AM
ఎస్టీయూ మండల అధ్యక్షుడు సందీప్
రేగోడు, నవంబర్ 13 :2024 సంవత్సర ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ గురునాథ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్టీ యు మండల అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ 2024 సంవత్సర ఉపాధ్యాయుల సర్వీస్ బుక్ ఎంట్రీ, ఐఎఫ్ఎంఎస్ ఎడిటింగ్, ఆరు రోజుల వేతనం గురించి పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార ్యక్రమంలో ఎస్టీయు మండల ఉపాధ్యక్షులు ఆదిత్య గౌడ్, ప్రధాన కార్యదర్శులు నరేష్, పూజ, కార్యదర్శులు అనూష, స్రవంతి పాల్గొన్నారు.