17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

‘గోపి గాళ్ల గోవా ట్రిప్’లో సిద్దిపేట కుర్రోడు

14-11-2025 12:21 AM
  1. అవకాశం వస్తే నిరూపించుకుంటా 

ప్రధాన పాత్రధారి రాజు 

సిద్దిపేట క్రైం, నవంబర్ 13 : సిద్దిపేటకు చెందిన శివరాత్రి రాజు ప్రధాన పాత్రలో రూపొందిన ’గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంజాయ్ కోరుకునే యువకులు గోవాలో ఎదుర్కొన్న పరిస్థితులు, పర్యావసనాలపై రూపొందించిన ఈ సినిమాకు శశి దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన విశేషాలనుదర్శకుడు శశి, ప్రధాన పాత్రధారి రాజు గురువారం ప్రెస్ క్లబ్ లో వెల్లడించారు.

అవంతి సినిమా బ్యానర్, సాయి కుమార్ నిర్మాణ సారథ్యంలో రూ.కోటి బడ్జెట్ తో, ఎనిమిది ప్రదాన పాత్రదారులతో నిర్మించిన చిత్రం 70 థియేటర్లలో రిలీజ్ కాబోతుందని చెప్పారు. శనివారం సిద్దిపేటలోని శ్రీనివాస్ థియేటర్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు. 20 రోజుల్లో షూటింగ్ ముగించుకుని ఎక్కడా చిన్న సినిమా అనే అభిప్రాయం కల్గకుండా, సహజత్వం ఉట్టిపడేలా సినిమాను తీశామన్నారు.

ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని దర్శకుడు కోరారు. ప్రధాన పాత్రధారి రాజు మాట్లాడుతూ, పట్టణంలోని 15 వ వార్డు ఇమాంబాద్ కు చెందిన తాను ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి సినిమానే ప్రపంచంగా బతుకుతున్నా అన్నారు. అవకాశం వస్తే తానేంటో నిరూపించుకుంటానని చెప్పారు. గోపి గాళ్ల గోవా ట్రిప్ సినిమాను ఆదరించాలని కోరారు.