09-05-2025 04:33:52 PM
నిర్మల్, (విజయక్రాంతి): హైదరాబాదులోని రాజేంద్రనగర్(Rajendranagar)లో ఐదు రోజులపాటు నిర్వహించిన ఉపాధ్యాయుల విద్యా సామర్థ్యాల పెంపు శిక్షణను పూర్తి చేసుకున్నట్టు ఉపాధ్యాయులు తెలిపారు. ఈనెల ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహించిన శిక్షణలో జిల్లాకు చెందిన మురళీధర్ గంగా దాస్ ఎల్లయ్య ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి జిల్లాస్థాయిలో ఎంపికై శిక్షణ తీసుకున్నారు. వీరు త్వరలో నిర్మల్ జిల్లాలోని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నట్టు వారు వివరించారు.