03-02-2026 01:58:04 AM
అయిజ ఫిబ్రవరి 2 జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని ఉత్తనూర్ గ్రామం లో ఎన్టీఆర్ స్టేడియం నందు సీఎం కప్ క్రీడలను తహసిల్దార్ జ్యోతి ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృ ఢంగా ఉండాలంటే క్రీడలు తప్పనిసరి అని ఆటలలో గెలుపోటములు సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉన్నత స్థా నాన్ని అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తనూర్ సర్పంచ్ రాణెమ్మ, సీఎం కప్ మండల కన్వీనర్ భాస్కర్, ఎంపీడీవో భాస్కర్, ఎంఈఓ రాములు, మండల కన్వీనర్ సతీష్ కుమార్ మరియు విద్యార్థిని వి ద్యార్థులు పాల్గొన్నారు.