16 April, 2026 | 12:03 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

మండలంలో బీసీ బంద్ ప్రశాంతం

18-10-2025 03:34 PM

రోడ్డుపై బైఠాయించి బీసీ బందుకు మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో శనివారం తలపెట్టిన బీసీ బందు ప్రశాంతంగా ముగిసింది.అఖిలపక్షం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని పాఠశాలలను బంద్ చేయించారు. దుకాణాలను,ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్చందంగా బంద్ పాటించాలని కోరారు. అనంతరం మండల కేంద్రం అర్వపల్లిలోని సూర్యాపేట-జనగాం 365(బీ)జాతీయ రహదారిపై బైఠాయించి బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సీఐ నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో ఎస్సై ఈట సైదులు తన సిబ్బందితో వచ్చి శాంతిభద్రతలకు ఆటంకం కలుగకూడదని అఖిలపక్ష నాయకుల నిరసనను విరమింప చేశారు.