18-10-2025 10:06:28 PM
భీమిని (విజయక్రాంతి): భీమినిలో అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రెండున్నర క్వింటాళ్లు పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నామని భీమిని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ అమీర్ ఖాన్, TS01ub1432 ఆటోలో వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా అట్టి ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. అక్రమంగా ఎవరన్నా రేషన్ బియ్యాన్ని రవాణా చేసిన, నిల్వ ఉంచిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.