14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

బీసీల రాష్ట్ర బంద్ లో ఉద్రిక్తత..

18-10-2025 10:03 PM

చిట్యాల (విజయక్రాంతి): బీసీల రాష్ట్ర బంద్ లో ఉద్రిక్తత వాతావరణం శనివారం జాతీయ రహదారి 65 పై చోటుచేసుకుంది. బీసీలకు న్యాయంగా దక్కాల్సిన 42% రిజర్వేషన్స్ సాధన కోసం శనివారం బీసీల రాష్ట్ర బంద్ ను నిర్వహించగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం నుండి ర్యాలీగా వచ్చిన నిరసనకారులు ఒక్కసారిగా జాతీయ రహదారి 65 పై అన్ని పార్టీలకు చెందిన నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై వెళ్లే ప్రయాణికులకు అంతరాయం ఏర్పడి కొద్దిసేపు రోడ్డుపై ఘర్షణ వాతావరణం ఏర్పడగా, పోలీసుల రాకతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ఘర్షణ జరుగుతుందని ముందే పసిగట్టిన పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేయగా, సమస్య ఉద్రిక్తం అవ్వకుండా చూసుకున్నారు.