16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

కుభీర్‌లో బీసీ బంద్ ర్యాలీ

18-10-2025 03:39 PM

బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు ఐక్యంగా పాల్గొని బంద్‌ విజయవంతం

కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండల కేంద్రం లో బీసీ వర్గాల హక్కుల సాధన కోసం బీసీ బంద్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఎన్నిల అనిల్, మోహిఉద్దీన్ మరియు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున ఏషాల దత్తాత్రి, బోయిడి అభిషేక్, కందుర్ కనకయ్య నేతృత్వంలో కార్యకర్తలు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగి, బీసీ వర్గాలకు న్యాయం చేయాలని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి బంద్‌కి మద్దతు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గాల సంక్షేమం కోసం రాజకీయ భేదాలు పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. బీసీ బంద్ కార్యక్రమం శాంతియుతంగా ముగిసింది.