17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సుల్తానాబాద్ లో బీసీ బందు విజయవంతం

18-10-2025 03:11 PM

పెద్ద సంఖ్యలో పాల్గొన్న పలు పార్టీల నేతలు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందులో భాగంగా శనివారం సుల్తానాబాద్ పట్టణంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంధు విజయవంతమైంది .. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బహుజన సమాజ్ పార్టీ లతోపాటు అన్ని కుల సంఘాల నాయకులు బందులో పాల్గొన్నారు. ఉదయం నుండి పట్టణంలో కలియ తిరిగిన అఖిలపక్షం నేతలు వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు సినిమా హాల్ పాఠశాలలను మూయించి వేశారు.

పట్టణంలో ర్యాలీగా తిరిగిన అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ, అత్యధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని, పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి బీసీ లందరూ మద్దతుగా నిలవాలని బీసీల ఐక్యతను సాధించేంతవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.

రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలన్నారు. 42 శాతం కచ్చితంగా అమలు చేసి తీరే విధంగా  ఉద్యమించాలన్నారు. అలాగే సుల్తానాబాద్ వాకర్స్ ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది... ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డిల ఆధ్వర్యంలో  భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.