15 June, 2026 | 10:40 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బీసీ బంద్ విజయవంతం

18-10-2025 03:08 PM

చిలుకూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందులో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బంద్ చేపట్టారు. ఈ బందుకు కాంగ్రెస్, బిజెపి, కూడా మద్దతు తెలిపాయి,ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, రాజకీయాలు ఎన్నికల వరకేనని రిజర్వేషన్ విషయంలో అందరం ఏకం కావలసిన అవసరం  ఉందని, పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ, బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బందులో పాల్గొన్నారు.