15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బీసీ బంద్ విజయవంతం

18-10-2025 03:08 PM

చిలుకూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందులో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బంద్ చేపట్టారు. ఈ బందుకు కాంగ్రెస్, బిజెపి, కూడా మద్దతు తెలిపాయి,ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, రాజకీయాలు ఎన్నికల వరకేనని రిజర్వేషన్ విషయంలో అందరం ఏకం కావలసిన అవసరం  ఉందని, పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ, బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బందులో పాల్గొన్నారు.