03-06-2025 01:28:43 AM
- మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం
- డల్లాస్ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): ఓట్లల్లో వెనుకబడ్డమేమో గానీ.. తెలంగాణను ప్రేమించడంలో కాదని, అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణే మాకు మొదటి ప్రాధాన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రవాస తెలంగాణవాసులు, స్వరాష్ట్రంలో పెట్టుబుడులుపెట్టి, మాతృభూమి రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని జోస్యం చెప్పారు.అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు.
ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆనాడు కేసీఆర్ పిలుపుతో సకల జనులు ఏకమై, పోరాట పటిమను ప్రదర్శిం చి తెలంగాణను సాధించుకున్నారని చెప్పా రు. అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి, పోరాట స్ఫూర్తిని చాటారని కేటీఆర్ తెలిపారు. ఓవైపు తెలంగాణ పార్టీకి రజతోత్సవం, మరోవైపు తెలంగాణ రాష్ట్రానికి పుష్కర సంవత్సరమన్నారు. పదేళ్లపాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాధ్యతలా భా వించామన్నారు.
డల్లాస్ బీఆర్ఎస్ సభ సక్సెస్
అమెరికాలోని డల్లాస్లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సభ, పార్టీ రజతోత్స సంబురం విజయవంత మైంది. అమెరికాలో భారత్లోని ఓ రాజ కీయ పార్టీ పెద్దఎత్తున సభ నిర్వహించడం ప్రతీఒక్కరి దృష్టిని ఆకర్షించింది.
ఎన్నారైలు వేలాదిగా తరలివచ్చి కేటీఆర్ ప్రసంగాన్ని విన్నారు. సభ నిర్వహించిన డాక్టర్ పెప్పర్ ఏరినా ప్రాంగణం కెపాసిటీ 7 వేలు అయితే, దాన్ని మించి సభ కు ఎన్నారైలు తరలివచ్చారన్నారు నిర్వాహకులు చెప్పారు.