03-06-2025 10:23:20 AM
కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు పట్టణంలో 11వ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం, ప్రయివేట్ కార్యలయాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని నూతన పురపాలక కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఈవో నందిశెట్టి నాగేశ్వరావు. అనంతరం ఎంపీడీవో కార్యలయం లో ఎంపీడీవో చంద్రశేఖర్ జాతీయ జండా ఆవిష్కరణ చేసారు.
తహసీల్దార్ కార్యలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న తహసీల్దార్ పులి సాంబశివుడు. ఎన్ఎస్పీలో గల రెవిన్యూ డివిజినల్ కార్యలయంలో ప్రొఫెసర్ జయశంకర్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మరియు దేశ చరిత్ర కలిగిన మహనీయుల చిత్రం పాటలకు పూలమాల వేసి నివాళులు అర్పించి,జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన ఆర్డివో రాజేందర్ గౌడ్.
వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో తెలంగాణ అమరవీరుల చిత్ర పటాల వద్ద కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్మా గాంధీజీ, బాబా సాహెబ్ అంబెడ్కర్, జయ శంకర్ చిత్రం పటాలకు పూలమాల వేసి జాతీయ జండా ఆవిష్కరణ చేసారు. ఆఫీస్ లో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న వ్యవసాయం కార్యాలయ కార్యదర్శి గుండాగోణి సత్యనారాయణ గౌడ్.
ఈ కార్యక్రమంలో మున్సిపల్, ఎంపీడీఓ, రెవిన్యూ సిబ్బంది, పట్టణ కాంగ్రెస్ నాయకులు లక్కినేని కృష్ణా, ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి, ఆళ్లకుంట నరసింహారావు, దారా రంగా, పుల్లారావు,భైర్ల కాంతారావు, దామల రాజు, షైక్ బాజీ, కృష్ణా రెడ్డి, మట్టా రామకృష్ణ, పసుపు లేటి శ్రీనివాస్ రావు, తోట సుబ్బారావు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వాదులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనగలరు.