29-09-2025 10:56:19 PM
కామారెడ్డి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : తెలంగాణ సౌత్ క్యాంపస్లో జియో ఇన్ఫర్మేటిక్ చదువుతున్న విద్యార్థినికి గ్రూప్-2 ఫలితాల్లో ఎస్ఐగా కంకణాల శ్రీజా రెడ్డి ఎంపికయ్యారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, సౌత్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ విభాగానికి చెందిన ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న శ్రీజా రెడ్డి ది కరీంనగర్ జిల్లాకు చెంది రాధిక -జైపాల్ రెడ్డిల కుమార్తె కంకణాల శ్రీజా రెడ్డి కీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్-2 ఫలితాలలో ఎక్సైజ్ ఎస్ఐగా ఎంపిక అయ్యారు.
మొన్న ప్రకటించిన గ్రూప్-1 ఫలితాల్లో సైతం ఎంపీడీఓగా ఎన్నికయ్యారు. ఒకేసారి రెండు ఉద్యోగాలు రావడంతో శ్రీజరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సౌత్ క్యాంపస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.సుధాకర్ గౌడ్, డిపార్ట్మెంట్ అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. సౌత్ క్యాంపస్ అధ్యాపక బృందం, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.