17 April, 2026 | 6:37 AM

హనుమాన్ జయంతి ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆలయ చైర్మన్

11-04-2025 08:19 PM

మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సలాబత్పూర్  హనుమాన్ మందిర్ లో హనుమాన్ జయంతి వేడుకలకు భక్తుల వసతులను పరిశీలించిన ఆలయ చైర్మన్ రామ్ పటేల్, ఆయన మాట్లాడుతూ.... నేడు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతులు దర్శనం కొరకు ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించిన ఆలయ చైర్మన్ రామ్ పటేల్, ప్రతి ఒక భక్తుడికి  ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ హనుమాన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.