5 March, 2026 | 5:17 PM

Breaking News

నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ తగిలి రైతుమృతి   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •   పరీక్షలు అంటే భయం వీడాలి   •  

ఇండ్ల పట్టాల పంపిణీలో ఉద్రిక్తత

12-01-2026 03:32 AM
  1. కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం, తోపులాట
  2. గోదావరిఖనిలో మంత్రులు పాల్గొన్న సభలోనే ఘటన

పెద్దపల్లి/గోదావరిఖని, జనవరి 11 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆదివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. పట్టాల పంపిణీ అనంతరం మంత్రులు వేదిక నుంచి దిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య వేదికపైనే వాగ్వాదం చోటు చేసుకుంది.

ఇండ్ల పట్టాల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘర్షణకు కారణంగా తెలుస్తోంది. వాగ్వాదం క్రమంగా తోపులాటకు దారితీయడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనతో కొంతసేపు సభా కార్యక్రమం అంతరాయం ఏర్పడింది. ఘర్షణకు కారకులైన వారిపై ఎమ్మెల్యే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.