25-04-2025 12:00:00 AM
పర్యాటకుల స్వర్గధామంగా, మినీ స్విర్జర్లాండ్గా పేర్గాంచిన జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో పదుల సంఖ్యలో పర్యాటకులు మృతి చెందడం అత్యంత దయనీయం. అమానుషమైన ఈ ఘటన దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రవాదుల ఈ దుశ్చర్య అమానవీయమేకాక అత్యంత దారుణం కూడా.
ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని వారెవరూ దెబ్బతీయలేరు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా మరణించడం బాధాకరం. ఉగ్రమూకల విషయంలో కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలి. మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలి.
కామిడి సతీష్రెడ్డి, భూపాల్పల్లి జిల్లా