30 June, 2026 | 10:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్

17-12-2025 12:00 AM

హుజురాబాద్, డిసెంబరు 16 (విజయ క్రాంతి): జిల్లాలో ఈ నెల 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో హుజురాబాద్, వీణవంక మండలాలలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను మంగళవారం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ క్రిటికల్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు. ఎఫ్ ఎస్ టీ, ఎస్ ఎస్ టీ టీంలు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇచ్చామని, ఈ సీ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తించాలని సూచించారు.

బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రి సరి చూసుకోవాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన వాహనాల్లోనే ఎన్నికల సామగ్రి తరలించాలని స్పష్టం చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.