12 June, 2026 | 5:30 PM

Breaking News

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •   ఇంటర్ ప్రవేశానికి భద్రాచలంలో 15న స్పాట్ కౌన్సెలింగ్   •  

అధికారులు సమస్యలను పరిష్కరించాలి

23-01-2026 12:40 AM

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

సికింద్రాబాద్ జనవరి 22 (విజయక్రాంతి) : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం ఫతేనగర్ డివిజన్లోని పర్యటించారు. ఇందులో భాగంగా ఫతేనగర్ డివిజన్లోని భరత్ నగర్ కాలనీలో ప్రధాని రహదారిలో వాటర్ వర్క్స్ అధికారులు రోడ్డు తవ్వి రోడ్డు వేయకపోవడంతో రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండడంతో స్కూ లు పిల్లలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను కాలనీవాసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులతో కలిసి ఆ ప్రాం తాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జల మండలి అధికారులుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, దోమల సమస్యలకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించి పది రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, ఈఈ గోవర్ధన్, ఏఈ రంజిత్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీను, బిక్షపతి, విజయ్ కుమా ర్, ఉమావతి గౌడ్, జ్యోతి గౌడ్, కుమారి, జనరల్ సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.