07-07-2025 01:42:40 AM
కొత్తపల్లి, జూలై 6 (విజయక్రాంతి): కరీంనగర్ మండలం లోని నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని మక్క కంకులు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులుపాల్గోన్నారు.