07-07-2025 01:43:54 AM
యాచారం జూలై 6 : యాచారం పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం యాచా రంలో సాగర్ రోడ్డుపై వాహనాల తనిఖీ లు చేపట్టారు. సీఐ నందీశ్వర్ రెడ్డి రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు.
కార్లు, ఇతర వాహనాల్లో ఏం తరలిస్తున్నారో పరిశీలించారు. వాహనాలు నడిపే వారు, ఆర్సీ, లైసెన్స్లు కలిగి ఉండాలని సూచిం చారు. అతి వేగంతో ప్రమాదాలకు గురి కావద్దని చెప్పారు. రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపర మైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్ర మంలో ఎస్ఐ లు సిబ్బందిపాల్గొన్నారు.