14 April, 2026 | 5:14 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

చికిత్స పొందుతున్న పేదలకు సీఎం సహాయనిధి ఊరట

12-01-2026 12:00 AM

చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి పామేన భీంభరత్

మొయినాబాద్ జనవరి 11(విజయ క్రాంతి):  ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని, చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీంభరత్ పేర్కొన్నారు. నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మంజూరైన చెక్కులను ఆదివారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ లోని తన కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి అందజేశారు.  చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని వందలాది మంది పేదలకు చెక్కులు అందించినట్లు తెలిపారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు మాణయ్య, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, భద్రప్ప, మొయినాబాద్ లీగల్ సెల్ అధ్యక్షుడు బైకని కుమార్ యాదవ్, మాధవరెడ్డి, జొన్నాడ మైసయ్య, కేబుల్ రాజు, సురంగల్ వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, గోపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ జడ్పిటిసి, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గోన్నారు.