16 April, 2026 | 7:26 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

31-12-2025 12:00 AM

కొల్చారం, డిసెంబర్ 30 :మండల కేంద్రంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం, సహకార సంఘం ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మం గళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువుల నిల్వలు, అమ్మకాలు, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు.

జిల్లాలో పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని అక్టోబర్ 2025 నుండి జనవరి 2026 వరకు జిల్లాకు 12 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటే ఇప్పటికే 12,673 యూరియా జిల్లాకు వచ్చి ఉందన్నారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ అధికారులు ఏ డి ఏ పుణ్యవతి, తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఏ ఈ ఓ లు రాజ శేఖర్ గౌడ్, స్రవంతి పాల్గొన్నారు.