12 June, 2026 | 2:10 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ లక్ష్యం

23-01-2026 12:35 AM

నెమలి అనిల్ కుమార్

ఉప్పల్, జనవరి 22 (విజయక్రాంతి) : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంమని నెమలి అనిల్ కుమార్ అన్నారు. గురువారం నాడు మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలపై వాటర్ వరక్స్ ఏఈ శ్రీ సిరాజ్ కలిసి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నెమలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, బస్తీలో నివసిస్తున్న ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం, వాటికి శాశ్వత పరిష్కారాలు తీసుకురావడమే లక్ష్యంగా బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజ ల వద్దకే వెళ్లి వారి సమస్యలు వినడం, సం బంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, పరిష్కారం వచ్చే వరకు నిరంతర అనుసరణ చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అని స్పష్టం చేశారు. అన్నపూర్ణ కాలనీలో తాగునీటి సరఫరా లోపాలు, డ్రైనేజ్ సమస్యలపై కాలనీ ప్రజలు తన దృష్టికి తీసు కువచ్చారని, వాటి పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తూ త్వరితగతిన చర్య లు తీసుకునేలా కృషి చేస్తానని  అనిల్ కు మార్ భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ తండ్రా శ్రీకాంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు శేఖర్ బాబు, భాను చంద్ర రెడ్డి, పాషా, ముబీన్, ప్రసాద్, హరీష్తో పాటు కాలనీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.